యూఏఈ ఉదారత: 1,000 మంది పాలస్తీనియన్ పిల్లలకు చికిత్స

- November 02, 2023 , by Maagulf
యూఏఈ ఉదారత: 1,000 మంది పాలస్తీనియన్ పిల్లలకు చికిత్స

యూఏఈ: గాజా నుండి విదేశీయుల తరలింపు,  గాయపడిన పౌరుల కోసం ఈజిప్ట్ రఫా క్రాసింగ్ తెరిచింది. దీంతో  వైద్య చికిత్స కోసం 1000 మంది పాలస్తీనియన్ పిల్లలను యూఏఈకి తీసుకురానున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్,  ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC) ప్రెసిడెంట్ మిర్జానా స్పోల్జారిక్ ఫోన్ కాల్‌ సంభాషణ జరిగింది. ఈ క్రమంలో ఈ ప్రకటన వెలువడింది.   ఈ సందర్భంగా వారు గాజాలోని పౌరులకు సురక్షితమైన, నిరంతరాయంగా వైద్య సహాయం అందించడంపై చర్చించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com