COP28: దుబాయ్లో 3 రోజులు గడపనున్న పోప్ ఫ్రాన్సిస్
- November 02, 2023
యూఏఈ: వాతావరణ మార్పుల COP28 కాన్ఫరెన్స్ కోసం తాను డిసెంబర్ ప్రారంభంలో దుబాయ్కి వెళతానని పోప్ ఫ్రాన్సిస్ బుధవారం చెప్పారు. డిసెంబర్ 1న దుబాయ్ బయలుదేరి 3వ తేదీ వరకు అక్కడే ఉంటానని తెలిపారు. పర్యావరణం పట్ల శ్రద్ధ వహించడానికి తన పోప్ పదవిలో ఉన్న సమయంలో తాను చాలా ఆందోళన చెందినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ ఇటాలియన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఫ్రాన్సిస్ ప్రకటించారు. దుబాయ్లో అంతర్జాతీయ వాతావరణ సదస్సు నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 12 వరకు కొనసాగుతుంది. పోప్ 2015లో రాసిన ఓ ఆర్టికల్ లో.. భూమి వేడెక్కడం గురించి హెచ్చరించారు. భూమిపై క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా అనేక జీవజాతులు కనుమరుగైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దుబాయ్ ఎడిషన్ అనేది వాతావరణ మార్పుల ప్రభావం, గ్రీన్హౌస్-గ్యాస్ ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలు, వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చేపట్టాల్సి చర్యలపై COP సమావేశాల సందర్భంగా చర్చించనున్నారు. COP మొదటి సమావేశం 1995లో బెర్లిన్లో జరిగింది. అప్పటి నుండి వివిధ నగరాల్లో, వివిధ ఖండాల్లో ఈ సమావేశం జరుగుతూ వస్తుంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







