COP28: దుబాయ్లో 3 రోజులు గడపనున్న పోప్ ఫ్రాన్సిస్
- November 02, 2023
యూఏఈ: వాతావరణ మార్పుల COP28 కాన్ఫరెన్స్ కోసం తాను డిసెంబర్ ప్రారంభంలో దుబాయ్కి వెళతానని పోప్ ఫ్రాన్సిస్ బుధవారం చెప్పారు. డిసెంబర్ 1న దుబాయ్ బయలుదేరి 3వ తేదీ వరకు అక్కడే ఉంటానని తెలిపారు. పర్యావరణం పట్ల శ్రద్ధ వహించడానికి తన పోప్ పదవిలో ఉన్న సమయంలో తాను చాలా ఆందోళన చెందినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ ఇటాలియన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఫ్రాన్సిస్ ప్రకటించారు. దుబాయ్లో అంతర్జాతీయ వాతావరణ సదస్సు నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 12 వరకు కొనసాగుతుంది. పోప్ 2015లో రాసిన ఓ ఆర్టికల్ లో.. భూమి వేడెక్కడం గురించి హెచ్చరించారు. భూమిపై క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా అనేక జీవజాతులు కనుమరుగైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దుబాయ్ ఎడిషన్ అనేది వాతావరణ మార్పుల ప్రభావం, గ్రీన్హౌస్-గ్యాస్ ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలు, వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చేపట్టాల్సి చర్యలపై COP సమావేశాల సందర్భంగా చర్చించనున్నారు. COP మొదటి సమావేశం 1995లో బెర్లిన్లో జరిగింది. అప్పటి నుండి వివిధ నగరాల్లో, వివిధ ఖండాల్లో ఈ సమావేశం జరుగుతూ వస్తుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







