గాజా ఇష్యు.. అమెరికా, అరబ్ నేతలు భేటీ

- November 04, 2023 , by Maagulf
గాజా ఇష్యు.. అమెరికా, అరబ్ నేతలు భేటీ

యూఏఈ: గాజాలో పెరుగుతున్న యుద్ధం, క్షీణిస్తున్న మానవతా పరిస్థితిపై అరబ్ నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో జోర్డాన్‌లో అరబ్ నాయకులు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ తక్షణం కాల్పుల విరమణ చేపట్టేలా ఒత్తిడి తేవాలని వారు  డిమాండ్ చేయనున్నారు. శుక్రవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో బ్లింకెన్ సమావేశమయ్యారు.  బందీలను విడిపించేందుకు, గాజాలోకి సహాయాన్ని అనుమతించే విషయంలో సహాయం చేస్తానని, కానీ ఇజ్రాయెల్‌ను నిరోధించలేమని ఆయన అన్నారు. మరోవైపు నెతన్యాహు బందీలను విడిపిస్తే తప్ప కాల్పుల విరమణ గురించి ఆలోచించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బ్లింకెన్.. శనివారం ఎమిరాటీ, సౌదీ, ఖతారీ మరియు ఈజిప్టు విదేశాంగ మంత్రులతో పాటు అమ్మాన్‌లో పాలస్తీనా ప్రతినిధులతో సమావేశమవుతారని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.   ఇదిలా ఉండగా అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 15 మంది మరణించారని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు. కాగా, హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెట్ సైన్యం తెలిపింది.          

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com