గాజా ఇష్యు.. అమెరికా, అరబ్ నేతలు భేటీ
- November 04, 2023
యూఏఈ: గాజాలో పెరుగుతున్న యుద్ధం, క్షీణిస్తున్న మానవతా పరిస్థితిపై అరబ్ నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో జోర్డాన్లో అరబ్ నాయకులు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ తక్షణం కాల్పుల విరమణ చేపట్టేలా ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేయనున్నారు. శుక్రవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో బ్లింకెన్ సమావేశమయ్యారు. బందీలను విడిపించేందుకు, గాజాలోకి సహాయాన్ని అనుమతించే విషయంలో సహాయం చేస్తానని, కానీ ఇజ్రాయెల్ను నిరోధించలేమని ఆయన అన్నారు. మరోవైపు నెతన్యాహు బందీలను విడిపిస్తే తప్ప కాల్పుల విరమణ గురించి ఆలోచించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బ్లింకెన్.. శనివారం ఎమిరాటీ, సౌదీ, ఖతారీ మరియు ఈజిప్టు విదేశాంగ మంత్రులతో పాటు అమ్మాన్లో పాలస్తీనా ప్రతినిధులతో సమావేశమవుతారని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా అంబులెన్స్పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 15 మంది మరణించారని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు. కాగా, హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెట్ సైన్యం తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









