హత్య కేసులో ముగ్గురికి మరణ శిక్ష

- May 24, 2016 , by Maagulf
హత్య కేసులో ముగ్గురికి మరణ శిక్ష

ముగ్గురు సౌదీ వ్యక్తులకు మరణ శిక్ష విధించింది న్యాయస్థానం. ఐదుగురు భారతీయ కార్మికుల్ని హింసించి, సజీవంగా వారిని పాతిపెట్టి హత్య చేసిన కేసులో న్యాయస్థానం దోషులకు ఈ శిక్ష విధించింది. 2010లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫామ్‌ని అద్దెకు తీసుకున్న వృద్ధురాలు, నేలను తవ్వగా అక్కడ మనుషులకు చెందిన అస్థికలు లభించాయి. దాంతో, వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అక్కడి నుంచి అస్థికల్ని వెలికి తీయగా, ఓ ఐడీ కార్డ్‌ లభించింది. దాని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి హత్యాకాండకు పాల్పడినవారిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉందన్న ఆరోపణలతో పలువుర్ని అరెస్ట్‌ చేయగా, అందులో ముగ్గుర్ని న్యాయస్థానం దోషులుగా గుర్తించింది. వారిలో ఇద్దరు ఇప్పటికే వివిద కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com