హత్య కేసులో ముగ్గురికి మరణ శిక్ష
- May 24, 2016
ముగ్గురు సౌదీ వ్యక్తులకు మరణ శిక్ష విధించింది న్యాయస్థానం. ఐదుగురు భారతీయ కార్మికుల్ని హింసించి, సజీవంగా వారిని పాతిపెట్టి హత్య చేసిన కేసులో న్యాయస్థానం దోషులకు ఈ శిక్ష విధించింది. 2010లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫామ్ని అద్దెకు తీసుకున్న వృద్ధురాలు, నేలను తవ్వగా అక్కడ మనుషులకు చెందిన అస్థికలు లభించాయి. దాంతో, వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అక్కడి నుంచి అస్థికల్ని వెలికి తీయగా, ఓ ఐడీ కార్డ్ లభించింది. దాని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి హత్యాకాండకు పాల్పడినవారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉందన్న ఆరోపణలతో పలువుర్ని అరెస్ట్ చేయగా, అందులో ముగ్గుర్ని న్యాయస్థానం దోషులుగా గుర్తించింది. వారిలో ఇద్దరు ఇప్పటికే వివిద కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నా
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







