మహిళల పవర్ చాటిన దుబాయ్ రన్
- November 07, 2023
యూఏఈ: దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్లో నవంబర్ 5న అతిపెద్ద మహిళా రన్ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది. ఇది గర్ల్ పవర్, మహిళల సత్తాను చాటిచెప్పింది. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి పెట్టడం ద్వారా మహిళలను శక్తివంతం చేయడం ఈ రన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూఏఈ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ముహమ్మద్ అల్-ముర్ తెలిపారు. యూఏఈ అథ్లెటిక్ ఫెడరేషన్ మరియు దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సహకారంతో ప్లాన్ బి గ్రూప్ ఈ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించింది. దీనికి పర్యావరణ మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలిచింది.
దుబాయ్ ఉమెన్స్ రన్ అనేది అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యం చేయడం, దుబాయ్ నగరం ఎంత బహుళసాంస్కృతికంగా ఉందో తెలియజేయడం, ఈ ప్రాంతంలోని బలమైన మహిళలకు తమ ఉనికిని తెలియజేసేందుకు ఇది వేదికగా నిలిచిందన్నారు. గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ రేసు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని ముహమ్మద్ అల్-ముర్ వెల్లడించారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్లో మహిళలది ఒక ముఖ్యమైన పాత్ర అని, ఇందులో విజేతలుగా నిలిచిన వారు యూఏఈ తరపున విదేశీ ఫోరమ్లలో పాల్గొంటారని అల్-ముర్ పేర్కొన్నారు.
ఇక ఈ రన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు తెలుగు మహిళలు. చీరలలో ఈ రన్ కు హాజరయ్యి కాన్సర్ బాధితులకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
దుబాయ్ లో నివసిస్తున్న విమల ఆధ్వర్యంలో "Pretty Telugu Women" అంటూ ఒక 35 మంది మహిళలు; మన చీర కట్టుకి సాటి మరేది లేదు అనే రీతిలో ఈ రన్ లో పాల్గొని సందడి చేశారు. నిర్వాహకులు వీరికి మెమెంటోలు అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా తమకు మద్దతు ఇచ్చి ఈ రన్ లో పాల్గొనేందుకు వచ్చిన మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు "Pretty Telugu Women" టీమ్.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!