22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్.. ఈసారి ఘనంగా గోవాలో..
- November 08, 2023
గత ఇరవై ఒక్క ఏళ్లుగా నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి ఆధ్వర్యంలో సంతోషం అవార్డ్స్ ఘనంగా జరుగుతున్నాయి. గత సంవత్సరం తెలుగులో మొదటిసారిగా ఓటీటీ అవార్డులు కూడా ఇచ్చారు. త్వరలో 22వ సారి సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ జరగనున్నాయి.
ఈ సంవత్సరం మరింత గ్రాండ్ గా గోవాలో సంతోషం ఫిలిం అవార్డ్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సంతోషం అధినేత సురేష్ కొండేటి మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18న హైదరాబాదులో సంతోషం ఓటీటి అవార్డ్స్, డిసెంబర్ 2న గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నాం. నాకు సహకరిస్తున్న చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ అవార్డులకు సహకరిస్తున్న అందరు హీరోలు, అభిమానులకి కృతజ్ఞతలు. సంతోషం ఓటీటీ అవార్డ్స్ కూడా గత ఏడాది మొట్టమొదటిగా మొదలుపెట్టింది సంతోషం సంస్థ. రెండవసారి ఈ సంవత్సరం కూడా ఈ నెల 18వ తారీఖున ఓటీటీ అవార్డ్స్ ఇవ్వనున్నాం అని తెలిపారు.
అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. సంతోషం సంస్థ నుంచి 25 సంవత్సరాలు పాటు అవార్డులు కొనసాగించాలని అనుకున్నాను. ఈసారితో 22 సంవత్సరాలు. ఇంకో మూడు సంవత్సరాలు కచ్చితంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. సంతోషం మ్యాగజైన్ మొదలెట్టినప్పుడు నాకు ఇంకా చిన్న వయసు. నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు లాంటి అగ్ర నటీనటులందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ అవార్డ్స్ మొదలుపెట్టాను. టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు సంతోషం సురేష్ కొండేటి కూడా ఫిలింఫేర్ స్థాయిలో అవార్డ్స్ నిర్వహించగలడు అన్న ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనుకున్నాను. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ గారు లాంటి అగ్ర హీరోలు సురేష్ కొండేటి చేయగలడు అని నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇన్నాళ్లు వరకు సంతోషం ఫిలిం అవార్డ్స్ ఎక్కడ ఆగకుండా నిర్వహించాను, నిర్వహిస్తున్నాను అని అన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







