హిందీ, తెలుగు భాషలు రెండు కళ్ళు: యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

- November 09, 2023 , by Maagulf
హిందీ, తెలుగు భాషలు రెండు కళ్ళు: యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

విశాఖపట్నం: జాతీయ భాష హిందీ, మాతృభాష తెలుగు ప్రాశస్త్యాన్ని నలుదిశలా చాటిచెప్పేందుకు తన వంతుగా నిరంతరం కృషి చేస్తానని పార్లమెంట్ మాజీ సభ్యులు, సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. గురువారం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ హిందీ భవన్ లో  జర్నలిస్ట్ సంఘ నాయకులు యార్లగడ్డ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ హిందీ, తెలుగు భాషలు తనకు రెండు కళ్ళు లాంటివని, వాటి గొప్పతనాన్ని తెలియజెప్పే సాహితీ ప్రక్రియను కొనసాగిస్తానన్నారు. యార్లగడ్డ ఈ నెల 24న జరగనున్న తన 70 వసంతాల ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆహ్వానపత్రికను సీనియర్ పాత్రికేయులు నిమ్మరాజు, చలపతిరావు, జర్నలిస్ట్ డి. హరనాథ్ కు అందజేశారు. అనంతరం వీరు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను సత్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com