యువ ఉద్యోగార్ధులే లక్ష్యంగా ఫేక్ జాబ్ ఫ్రాడ్
- November 11, 2023
మస్కట్: యువకులను లక్ష్యంగా చేసుకుని SMS ద్వారా నకిలీ ఉద్యోగాల కోసం ప్రకటన పంపే కొత్త మోసపూరిత చర్యను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ గుర్తించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ యువకులను లక్ష్యంగా చేసుకుని కొత్త మోసపూరిత చర్యను గుర్తించిందని, దీని ద్వారా బాధితులను ఆకర్షించడానికి, ఆన్లైన్ వ్యాపారాలను నిర్వహించడానికి వారిని ఒప్పించడానికి SMS ద్వారా నకిలీ ఉద్యోగాల కోసం మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని, అధిక లాభాల ఆశ చూపి డిపాజిట్లు సేకరిస్తున్నారని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తాలను వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసిన తర్వాత, అవి వెంటనే ఎక్స్ఛేంజ్ కంపెనీల ద్వారా ఇతర ఆఫ్షోర్ ఖాతాలకు మళ్లించబడతాయన్నారు. ప్రచురించిన ప్రకటనల ప్రామాణికత మరియు మూలాన్ని ధృవీకరించుకోవాలని, ఏవైనా అనుమానాలు ఉంటే సంబంధిత అధికారులకు నివేదించాలని రాయల్ ఒమన్ పోలీసులు పౌరులు, నివాసితులకు సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!







