పెన్సిల్ మొనలపై దుబాయ్ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు చెక్కిన మాజీ క్యాబ్ డ్రైవర్‌

- November 11, 2023 , by Maagulf
పెన్సిల్ మొనలపై దుబాయ్ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు చెక్కిన మాజీ క్యాబ్ డ్రైవర్‌

దుబాయ్: భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన శామ్సన్ మసీహ్ 2017లో దుబాయ్‌కి వచ్చాడు. పాఠశాలలో ఉన్నప్పుడు సూక్ష్మ కళపై తీవ్ర ఆసక్తిని పెంచుకున్నాడు. శామ్సన్ 2010లో ఒక సంవత్సరం మొత్తం పెన్సిల్ ఆర్ట్ పై వివిధ రకాల సూక్ష్మ కళలతో ప్రయోగాలు చేశాడు. ఇండియాలోని గురుదాస్‌పూర్‌లోని హస్తా శిల్పా కాలేజీలో కళలో డిప్లొమా చేశాడు. 2015లో ఇండియాస్ గాట్ టాలెంట్‌లో జరిగిన ఆడిషన్ సాధించాడు.అతనికి ముగ్గురు సోదరులు, ఒక చెల్లెలు ఉన్నారు. ఆర్థికంగా ఎదగాలని అతను రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA)కి టాక్సీ డ్రైవర్‌గా దుబాయ్‌కి వచ్చాడు. ఇక్కడే తన ప్రతిభకు పదును పెట్టాడు. పగటిపూట టాక్సీ నడుపుతున్నప్పుడు, కస్టమర్‌లు లేని సమయంలో చిన్న బ్రేక్‌లు ఉంటాయి. ఆ సమయంలో అతను తన ఒడిలో టవల్‌ను పరచి తన పెన్సిల్ ఆర్ట్‌పై పని చేసేవాడినని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com