రియాద్‌లో అడుగుపెట్టిన ఇరాన్ అధ్యక్షుడు

- November 12, 2023 , by Maagulf
రియాద్‌లో అడుగుపెట్టిన ఇరాన్ అధ్యక్షుడు

రియాద్: జాయింట్ అరబ్ ఇస్లామిక్ ఎక్స్‌ట్రార్డినరీ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ,  అతని ప్రతినిధి బృందం శనివారం రియాద్‌కు చేరుకున్నారు. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రియాద్ రీజియన్ డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్, ఇరాన్‌లోని సౌదీ రాయబారి అబ్దుల్లా అల్-అంజీ, కింగ్‌డమ్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీరెజా ఎనయాటి, వివిధ అధికారులు స్వాగతం పలికారు.  గత 10 ఏళ్లలో ఇరాన్ అధ్యక్షుడు సౌదీలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.  సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు మార్చి 2023లో పునరుద్ధరించబడ్డాయి.  గాజాలో పరిస్థితిపై చర్చించేందుకు రియాద్‌లో జరిగే ఉమ్మడి అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో రైసీ పాల్గొంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com