తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- April 10, 2026
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (DA) పెంపును ప్రకటిస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేలమంది ఆర్టీసీ కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది.
తాజా నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెరిగింది. గతంలో ఇది 50.7 శాతం ఉండగా, తాజా పెంపుతో 52.8 శాతానికి చేరుకుంది. గత ప్రభుత్వం చివరిసారిగా 2025 జులైలో 2.1 శాతం డీఏ పెంచగా (అప్పుడు 48.6 శాతం నుండి 50.7 శాతానికి పెరిగింది), ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మరో విడత పెంపును అమలు చేసింది.
గడిచిన మూడు నెలలకు సంబంధించిన డీఏ బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో నెలకు సంబంధించి విడివిడిగా ఈ బిల్లులను రూపొందించి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









