రియాద్లో అడుగుపెట్టిన ఇరాన్ అధ్యక్షుడు
- November 12, 2023
రియాద్: జాయింట్ అరబ్ ఇస్లామిక్ ఎక్స్ట్రార్డినరీ సమ్మిట్లో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, అతని ప్రతినిధి బృందం శనివారం రియాద్కు చేరుకున్నారు. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రియాద్ రీజియన్ డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్, ఇరాన్లోని సౌదీ రాయబారి అబ్దుల్లా అల్-అంజీ, కింగ్డమ్లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీరెజా ఎనయాటి, వివిధ అధికారులు స్వాగతం పలికారు. గత 10 ఏళ్లలో ఇరాన్ అధ్యక్షుడు సౌదీలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు మార్చి 2023లో పునరుద్ధరించబడ్డాయి. గాజాలో పరిస్థితిపై చర్చించేందుకు రియాద్లో జరిగే ఉమ్మడి అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో రైసీ పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







