ఇజ్రాయెల్ చేసిన నేరాలపై దర్యాప్తు చేయాలి.. అరబ్-ఇస్లామిక్ దేశాల డిమాండ్
- November 13, 2023
రియాద్: ఇజ్రాయెల్కు ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఎగుమతులపై నిషేధం విధించాలని రియాద్లో జరిగిన అసాధారణ అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ పిలుపునిచ్చింది. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన నేరాలపై దర్యాప్తు చేయాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును కోరింది. గాజా స్ట్రిప్పై విధించిన దిగ్బంధనాన్ని తొలగించాలని, ఇంధనంతో సహా మానవతా సహాయాన్ని వెంటనే అనుమతించాలని శిఖరాగ్ర సమావేశం డిమాండ్ చేసింది. పాలస్తీనియన్లను ఉత్తర గాజా నుండి దక్షిణ భాగానికి లేదా గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ మరియు జెరూసలేం వెలుపలకు వెళ్లగొట్టాలనే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఆపాలని యూఎన్ భద్రతా మండలిని కోరింది. గాజాపై ప్రతీకార యుద్ధాన్ని "ఆత్మ రక్షణ"గా అభివర్ణించడాన్ని సమ్మిట్ తిరస్కరించింది. గాజాపై ఉన్న దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలన, తక్షణ సహాయాన్ని అందించాలని కోరింది. గాజాపై ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపాలని ఐరాస భద్రతా మండలి నిర్ణయాత్మక తీర్మానం చేయాలని శిఖరాగ్ర సమావేశం కోరింది.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









