దీపావళి శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- November 13, 2023
యూఏఈ: యూఏఈలోని భారతీయ ప్రవాసులకు యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "యూఏఈలో.. ప్రపంచవ్యాప్తంగా దీపావళిని జరుపుకుంటున్న వారందరికీ మా శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం అందరికీ శాంతి, ఆరోగ్యం మరియు ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాము" అని ఆయన పేర్కొన్నారు. యూఏఈ ప్రెసిడెంట్ హిందీలో కూడా అదే ట్వీట్ చేసారు. అలాగే యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. యూఏఈలోని నివాసితులు దీపావళి సందర్భంగా తమ బాల్కనీలను రంగు రంగుల పూవులతో అలంకరించారు. అనేక రంగులలో మెరిసే అద్భుత దీపాలను ఏర్పాటు చేశారు. దుబాయ్, అల్ మంఖూల్, బుర్ దుబాయ్, కరామా మరియు అల్ బర్షా వంటి ప్రాంతాల్లోని భవనాలు రంగురంగుల లైట్లతో వెలిగిపోయాయి.
हम यूएई और विश्व भर में दीपावली मना रहे सभी लोगों को शुभकामनाएँ देते हैं। आने वाला वर्ष सभी के लिए शांति, स्वास्थ्य और ख़ुशहाली लेकर आए।
— محمد بن زايد (@MohamedBinZayed) November 12, 2023
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







