దీపావళి శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- November 13, 2023
యూఏఈ: యూఏఈలోని భారతీయ ప్రవాసులకు యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "యూఏఈలో.. ప్రపంచవ్యాప్తంగా దీపావళిని జరుపుకుంటున్న వారందరికీ మా శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం అందరికీ శాంతి, ఆరోగ్యం మరియు ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాము" అని ఆయన పేర్కొన్నారు. యూఏఈ ప్రెసిడెంట్ హిందీలో కూడా అదే ట్వీట్ చేసారు. అలాగే యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. యూఏఈలోని నివాసితులు దీపావళి సందర్భంగా తమ బాల్కనీలను రంగు రంగుల పూవులతో అలంకరించారు. అనేక రంగులలో మెరిసే అద్భుత దీపాలను ఏర్పాటు చేశారు. దుబాయ్, అల్ మంఖూల్, బుర్ దుబాయ్, కరామా మరియు అల్ బర్షా వంటి ప్రాంతాల్లోని భవనాలు రంగురంగుల లైట్లతో వెలిగిపోయాయి.
हम यूएई और विश्व भर में दीपावली मना रहे सभी लोगों को शुभकामनाएँ देते हैं। आने वाला वर्ष सभी के लिए शांति, स्वास्थ्य और ख़ुशहाली लेकर आए।
— محمد بن زايد (@MohamedBinZayed) November 12, 2023
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







