సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురు సైనికులు మృతి
- November 13, 2023
న్యూయార్క్: అమెరికా ఆర్మీకి చెందిన హెలికాప్టర్ మధ్యధార సముద్రం లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని యూఎస్ మిలిటరీ ధ్రువీకరించింది. ఈ ఘటన నవంబర్ 10న చోటు చేసుకున్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండా ఉండేందుకు మధ్యధారా ప్రాంతంలో అమెరికా ఓ ఆర్మీ బృందాన్ని మోహరించింది. ఇందులో భాగంగా రోజూవారీ శిక్షణలో భాగంగా నవంబర్ 10వ తేదీన ఆర్మీ హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. కాసేపటికి సాకేంతిక సమస్య తలెత్తడంతో సముద్రంలో కుప్పకూలింది. ఆ సమయంలో హెలికాప్టర్లో ఉన్న ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు యూఎస్ మిలిటరీ ఆదివారం వెల్లడించింది.
కాగా, సైనికుల మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. వారి మరణం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అమెరికా ప్రజలు సురక్షితంగా జీవితం గడపటం కోసం సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని బైడెన్ అన్నారు. దేశం కోసం వారి జీవితాలను, ప్రాణాలను పణంగా పెడుతున్నారని సైనికుల సేవలను జో బైడెన్ కొనియాడారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







