IPOను ప్రారంభించిన దుబాయ్ టాక్సీ!

- November 13, 2023 , by Maagulf
IPOను ప్రారంభించిన దుబాయ్ టాక్సీ!

యూఏఈ: దుబాయ్ టాక్సీని దుబాయ్ ప్రభుత్వం పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీగా మార్చిన తర్వాత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) ద్వారా షేర్లను విక్రయించనుంది. దుబాయ్ పాలకుని హోదాలో యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ‘దుబాయ్ టాక్సీ కంపెనీ’కి సంబంధించిన 2023 నాటి లా నంబర్ (21)ని ఆదివారం ఆమోదించారు. ఈక్విటీ మార్కెట్‌లో లిక్విడిటీని పెంచడానికి, బోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను 3 ట్రిలియన్‌లకు పెంచడానికి దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ (DFM)లో 10 ఎంటిటీలను జాబితా చేయనున్నట్లు ఇటీవల దుబాయ్ ప్రకటించింది. ఇప్పటి వరకు యుటిలిటీ సర్వీస్ ప్రొవైడర్ దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా), టోల్ గేట్ ఆపరేటర్ సాలిక్, టెకామ్ గ్రూప్, డిస్ట్రిక్ట్ కూలింగ్ కంపెనీ ఎంపవర్ పబ్లిక్‌గా మారి స్థానిక బోర్స్‌లో తమ షేర్లను లిస్ట్ చేశాయి. పబ్లిక్‌కి వెళ్ళిన అన్ని ప్రభుత్వ-మద్దతు గల ఎంటిటీలు రిటైల్ మరియు సంస్థాగత పెట్టుబడిదారుల అభిమానాన్ని చురగొన్నాయి. ఆయా కంపెనీల షేర్లు  అనేకసార్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేయబడ్డాయి.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com