రియాద్లో ఇరాన్ అధ్యక్షుడు రైసీని కలిసిన క్రౌన్ ప్రిన్స్
- November 13, 2023
రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ శనివారం రియాద్లో జరిగిన అసాధారణ అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఈ ప్రాంతంలోని పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా గాజా స్ట్రిప్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ భీకర యుద్ధాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. తక్షణమే ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గాజా ప్రజల బాధలను తగ్గించడానికి మానవతా కారిడార్లను ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ మానవతా సంస్థలను అనుమతించాలని కోరారు. అలాగే బందీలను, ఖైదీలను విడుదల చేయాలని.. అమాయక ప్రజల జీవితాలను రక్షించడానికి క్రౌన్ ప్రిన్స్ పిలుపునిచ్చారు. ఆగస్ట్ 2021లో అధికారం చేపట్టిన తర్వాత ప్రెసిడెంట్ రైసీ సౌదీ అరేబియాకు ఇది మొదటిసారి. సౌదీ అరేబియా మరియు ఇరాన్ల మధ్య దౌత్య సంబంధాలు మార్చి 2023లో పునరుద్ధరించబడ్డాయి. దౌత్య కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. రెండు దేశాల రాజధానులలోనూ రాయబార కార్యాలయాలు పునఃప్రారంభించబడ్డాయి.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









