వింటర్లో ఈ పండ్లు తప్పక తినాల్సిందే.!
- November 16, 2023
చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ కాస్త తక్కువగా వుంటుంది. తద్వారా అనేక రకాల జబ్బులు ఈజీగా ఎటాక్ చేస్తుంటాయ్. ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయ్.
వాటి నుంచి తట్టుకోవాలంటే కొన్ని రకాల పండ్లను తప్పకుండా తినాలి ఈ కాలంలో. ఈ కాలంలో వచ్చే శీతాఫలంతో పాటూ, ‘సి’ విటమిన్ అధికంగా వుండే నారింజ పండును ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
నారింజలోని యాంటీ ఆక్సిడెంట్లు ఈ కాలంలో వచ్చే ఫ్లూ నుంచి శరీరం తట్టుకోవడానికి తగినంత ఇమ్యూనిటీ పవర్ని ఇస్తాయ్.. అలాగే, బొప్పాయి పండు కూడా.
చలికాలంలో చర్మం ముడుచుకుపోవడాన్ని బొప్పాయి నియంత్రిస్తుంది. శరీరానికి తగినంత తేమనందించి కాపాడుతుంది.
స్ట్రాబెర్రీలోనూ అధికంగా సి విటమిన్ వుంటుంది. అలాగే, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా వుంటాయ్. ఈ పండును డైరెక్ట్గా తీసుకున్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా కూడా ఈ కాలంలో మంచి ఫలితం వుంటుంది.
డ్రాగన్ ప్రూట్స్, ఖర్జూరం కూడా ఈ కాలంలో తినాల్సిన పండ్ల లిస్టులో చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి