యూఏఈలో భారీ వర్షాలు.. మూడు ఎమిరేట్స్లో రిమోట్ లెర్నింగ్
- November 17, 2023
యూఏఈ: మూడు ఎమిరేట్స్లోని అధికారులు అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా నవంబర్ 17 (శుక్రవారం) రిమోట్ లెర్నింగ్ కు మారాలని పాఠశాలలను ఆదేశించారు. ఈ మేరకు అజ్మాన్, రస్ అల్ ఖైమా మరియు ఉమ్ అల్ క్వైన్లోని స్థానిక అత్యవసర సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ బృందాలు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. జాతీయ వాతావరణ కేంద్రం (NCM) గురువారం మధ్యాహ్నం రస్ అల్ ఖైమాలో భారీ వర్షం కురిసిందని పేర్కొంది. దుబాయ్, షార్జా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో దేశంలోని తూర్పు, ఉత్తర మరియు తీరప్రాంతాల్లో మెరుపులు, ఉరుములు మరియు వివిధ తీవ్రతలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని, వాహనాల వేగాన్ని తగ్గించాలని, వరదలు మరియు బీచ్లకు దూరంగా వుండాలని నివాసితులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే Dh 2,000 వరకు జరిమానాలు, 23 బ్లాక్ పాయింట్లు మరియు రెండు నెలల పాటు వాహనాన్ని జప్తు చేఅవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







