యూఏఈలో భారీ వర్షాలు.. మూడు ఎమిరేట్స్లో రిమోట్ లెర్నింగ్
- November 17, 2023
యూఏఈ: మూడు ఎమిరేట్స్లోని అధికారులు అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా నవంబర్ 17 (శుక్రవారం) రిమోట్ లెర్నింగ్ కు మారాలని పాఠశాలలను ఆదేశించారు. ఈ మేరకు అజ్మాన్, రస్ అల్ ఖైమా మరియు ఉమ్ అల్ క్వైన్లోని స్థానిక అత్యవసర సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ బృందాలు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. జాతీయ వాతావరణ కేంద్రం (NCM) గురువారం మధ్యాహ్నం రస్ అల్ ఖైమాలో భారీ వర్షం కురిసిందని పేర్కొంది. దుబాయ్, షార్జా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో దేశంలోని తూర్పు, ఉత్తర మరియు తీరప్రాంతాల్లో మెరుపులు, ఉరుములు మరియు వివిధ తీవ్రతలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని, వాహనాల వేగాన్ని తగ్గించాలని, వరదలు మరియు బీచ్లకు దూరంగా వుండాలని నివాసితులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే Dh 2,000 వరకు జరిమానాలు, 23 బ్లాక్ పాయింట్లు మరియు రెండు నెలల పాటు వాహనాన్ని జప్తు చేఅవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







