యూఏఈలో భారీ వర్షాలు.. మూడు ఎమిరేట్స్లో రిమోట్ లెర్నింగ్
- November 17, 2023
యూఏఈ: మూడు ఎమిరేట్స్లోని అధికారులు అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా నవంబర్ 17 (శుక్రవారం) రిమోట్ లెర్నింగ్ కు మారాలని పాఠశాలలను ఆదేశించారు. ఈ మేరకు అజ్మాన్, రస్ అల్ ఖైమా మరియు ఉమ్ అల్ క్వైన్లోని స్థానిక అత్యవసర సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ బృందాలు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. జాతీయ వాతావరణ కేంద్రం (NCM) గురువారం మధ్యాహ్నం రస్ అల్ ఖైమాలో భారీ వర్షం కురిసిందని పేర్కొంది. దుబాయ్, షార్జా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో దేశంలోని తూర్పు, ఉత్తర మరియు తీరప్రాంతాల్లో మెరుపులు, ఉరుములు మరియు వివిధ తీవ్రతలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని, వాహనాల వేగాన్ని తగ్గించాలని, వరదలు మరియు బీచ్లకు దూరంగా వుండాలని నివాసితులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే Dh 2,000 వరకు జరిమానాలు, 23 బ్లాక్ పాయింట్లు మరియు రెండు నెలల పాటు వాహనాన్ని జప్తు చేఅవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









