దుబాయ్ లో Dh500 మిలియన్లకు పెంట్హౌస్ సేల్
- November 20, 2023
దుబాయ్: దుబాయ్లోని అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరల్లో పెరుగుదల కొనసాగుతోంది. పామ్ జుమేరాలో కొత్త పెంట్హౌస్ రికార్డు స్థాయిలో Dh500 మిలియన్లలకు అమ్ముడుపోయింది. 21,949 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇందులో ఐదు పడకగదుల కోమో రెసిడెన్సెస్ పెంట్హౌస్లో గృహ ఆటోమేషన్ సిస్టమ్, ప్రైవేట్ ఎలివేటర్ ద్వారా ప్రత్యేకమైన యాక్సెస్ ఏర్పాటు చేశారు. Dh420 మిలియన్ల విలువ కలిగిన అత్యంత ఖరీదైన పెంట్హౌస్కి(మార్సా అల్ అరబ్) సంబంధించి మునుపటి రికార్డును తాజా సేల్ అధిగమించింది. బుగట్టి రెసిడెన్సెస్లోని Dh750-మిలియన్ల స్కై మాన్షన్ పెంట్హౌస్ను కొనుగోలుదారు స్నాప్ చేసినప్పుడు.. ఈ Dh500 మిలియన్ల రికార్డు కూడా బద్దలవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్థానిక ప్రాపర్టీ మార్కెట్లో ఐరోపా, తూర్పు ఆసియా మరియు గల్ఫ్ దేశాల నుండి మిలియనీర్లు , బిలియనీర్ల నుండి అల్ట్రా-లగ్జరీ ఆస్తులకు బలమైన డిమాండ్ ఉందన్నారు. గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ప్రకారం.. దుబాయ్లో $10 మిలియన్లకు పైగా గృహాల మార్కెట్ బలపడుతోంది. Q1 2023లోనే 88 అమ్మకాలు నమోదు చేయబడ్డాయి. 2022లో దుబాయ్ $10 మిలియన్ ధర కంటే ఎక్కువ 219 డీల్లను నమోదు చేసింది. నగరం ప్రపంచంలోనే నాల్గవ అత్యంత రద్దీగా ఉండే లగ్జరీ గృహాల మార్కెట్గా నిలిచింది. 2023 మార్కెట్లోని ఈ విభాగానికి మరో రికార్డు సంవత్సరంగా మారుతోంది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









