మధుమేహం వున్నవారు ఈ ఆకుల్ని ఎక్కువగా తీసుకుంటే.!

- November 22, 2023 , by Maagulf
మధుమేహం వున్నవారు ఈ ఆకుల్ని ఎక్కువగా తీసుకుంటే.!

మధుమేహం.. షుగర్ వ్యాధి ఒక్కసారి తగిలిందంటే చాలు.. ఇక జీవితం అయిపోయినట్లే అని భావించేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు, మందులతో పాటూ, కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా కూడా మధుమేహాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు.

ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి మధుమేహం వున్నవారు. వాటిలో మెంతికూరను మధుమేహులకు వరంగా భావిస్తారు. మెంతికూరలోని పోషకాలు సహజ సిద్ధంగానే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో వుంచేందుకు సహాయ పడుతుంది.

అలాగే, కరివేపాకు కూడా షుగర్ వ్యాధి గ్రస్గులు తప్పక తీసుకోవాల్సిన ఆకు. కూరల్లో కరివేపాకును చాలా ఈజీగా తీసి పక్కన పడేస్తుంటాం. కానీ, కరివేపాకను అస్సలు లైట్ తీసుకోరాదు. కరివేపాకులోని ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిల్ని అదుపులో వుంచేందుకు తోడ్పడుతుంది.

అలాగే, ఇన్సులిన్ చర్యను సైతం వేగవంతం చేస్తుంది. అందుకే కరివేపాకును క్రమం తప్పకుడా ప్రతీరోజూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మెంతికూరను కనీసం రెండు రోజులకోసారి అయినా డయాబెటిక్ వ్యాదిగ్రస్తులు తమ మెనూలో వుండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటితో పాటూ, తీసుకోవల్సిన మందులు కూడా తప్పని సరిగా వాడుతుండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com