తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- March 06, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సీనియర్ నాయకురాలు, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) జనరల్ సెక్రటరీ కె.సి.వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఎర్రబెల్లి స్వర్ణకు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో విశేషమైన అనుభవం ఉంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయురాలిగా కొనసాగుతున్న ఆమె, పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. గతంలో ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వర్తించి, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
2002లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికైన ఎర్రబెల్లి స్వర్ణ, నగరానికి మొట్టమొదటి మహిళా మేయర్గా సేవలు అందించారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా కూడా గతంలో బాధ్యతలు నిర్వర్తించారు.ఎర్రబెల్లి స్వర్ణను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమించడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు







