టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- March 06, 2026
న్యూ ఢిల్లీ: 4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్లు రద్దు..కారణమిదే! ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను, ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ వార్తల ద్వారా అనవసరమైన భయాన్ని ప్రజల్లో సృష్టించి టీఆర్పీ పెంచుకుంటున్న టీవీ ఛానళ్లకు షాకిచ్చిన కేంద్రం
నాలుగు వారాలు లేక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇండియాలో BARC రేటింగ్స్ను సస్పెండ్ చేసిన కేంద్రం
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను, ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఇలాంటి సంచలన వార్తలు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా న్యూస్ ఛానళ్ల టీఆర్పీ (TRP) రేటింగ్లను తక్షణమే నిలిపివేయాలని బార్క్ (BARC) సంస్థను ఆదేశించింది.ఈ నిషేధం నాలుగు వారాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









