టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- March 06, 2026
న్యూ ఢిల్లీ: 4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్లు రద్దు..కారణమిదే! ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను, ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ వార్తల ద్వారా అనవసరమైన భయాన్ని ప్రజల్లో సృష్టించి టీఆర్పీ పెంచుకుంటున్న టీవీ ఛానళ్లకు షాకిచ్చిన కేంద్రం
నాలుగు వారాలు లేక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇండియాలో BARC రేటింగ్స్ను సస్పెండ్ చేసిన కేంద్రం
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను, ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఇలాంటి సంచలన వార్తలు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా న్యూస్ ఛానళ్ల టీఆర్పీ (TRP) రేటింగ్లను తక్షణమే నిలిపివేయాలని బార్క్ (BARC) సంస్థను ఆదేశించింది.ఈ నిషేధం నాలుగు వారాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









