ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- March 06, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 13 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా అందుబాటులో లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
ఈ నిషేధాన్ని అమలు చేయడానికి అవసరమైన విధివిధానాలను రాబోయే 90 రోజుల్లో ఖరారు చేస్తామని సీఎం ప్రకటించారు. సాంకేతికత వల్ల పిల్లలు తప్పుదోవ పట్టకుండా, వారి చదువుపై దృష్టి పెట్టేలా ఈ మార్పులు తీసుకురానున్నారు. దీనికోసం ప్రత్యేక చట్టం లేదా నిబంధనలను రూపొందించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు.
ప్రస్తుతం 13 ఏళ్లుగా ఉన్న ఈ వయసు పరిమితిని, అందరి ఆమోదంతో 16 ఏళ్ల వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. సోషల్ మీడియా వల్ల పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదని సీఎం నొక్కి చెప్పారు. సమాజంలోని మేధావులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే సూచనల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









