'మజెంటా' పేరుతో జూన్ 1న ..
- May 25, 2016
ఇంటర్నెట్ సేవల్లో అగ్రగామిగా ఉన్న గూగుల్.. కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)తో అద్భుతాలు సృష్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మనుషులు చేసే పనులను కృత్రిమ మేధస్సుతో చేయించే సాంకేతికతను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైంది. 2011 నుంచి గూగుల్ 'బ్రెయిన్' ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు ఏఐ మెషీన్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ తనంతట తానే వినసొంపైన సంగీత స్వరాలు పలికిస్తూ.. అందమైన పెయింటింగ్స్ వేసే కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. 'మజెంటా' పేరుతో జూన్ 1న ఈ ప్రాజెక్ట్ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అప్లికేషన్ రూపంలో ఉండే మజెంటాను ఎవరైనా వాడుకోవచ్చట. అది సృష్టించే సంగీతాన్ని వినొచ్చట.
గూగుల్ బ్రెయిన్ బృందం గతేడాది విడుదల చేసిన 'టెన్సార్ఫ్లో' మెషీన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్తో మజెంటా పనిచేస్తుందట. పాటలను అప్లోడ్ చేస్తే.. వాటిని కృత్రిమ మేధస్సుతో విశ్లేషించి మజెంటా సొంతంగా స్వరాలు పలికిస్తుందట. ఇప్పటికే గూగుల్ కొన్ని గంటల నిడివి ఉన్న పాటలను మజెంటాలోకి అప్లోడ్ చేసింది. ఎన్ని ఎక్కువ పాటలు అప్లోడ్ చేస్తే.. అంత బాగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
సాధారణ గాయకుల్లాగే.. ఈ మెషీన్ కూడా సొంతంగా ఆలోచిస్తుంది. ఈ కృత్రిమ గాయని సృష్టించే స్వరాలతో గూగుల్ ఓ ఆల్బమ్ను కూడా విడుదల చేయనుంది. అలాగే.. మనం ఏదైనా చిత్రాన్ని మజెంటాలోకి అప్లోడ్ చేస్తే దాన్ని అందంగా తీర్చిదిద్దుతుంది. మనుషుల ప్రమేయం లేకుండానే కంటికి ఇంపైన పెయింటింగ్స్ రూపొందిస్తుందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







