టీ20: ఆస్ట్రేలియా పై భారత్ విజయం...
- November 27, 2023
తిరువనంతపురం: వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ భారత్ విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచులో టీమ్ఇండియా 57 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకువెళ్లింది. 236 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 191 పరుగులకు పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ (45; 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూవేడ్ (42 నాటౌట్), టిమ్ డేవిడ్ (37) లు రాణించారు. భారత బౌలర్లలో రవిబిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ లు చెరో మూడు వికెట్లు తీశారు. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలా వికెట్ పడగొట్టారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (53; 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు చేశారు. ఆఖర్లో రింకూ సింగ్ (31 నాటౌట్; 9 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్లు శుభారంభం అందించారు. జైస్వాల్ మొదటి బంతి నుంచే ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. సీన్ అబాట్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుసగా 4,4,4,6,6 బాది 24 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అయితే.. ఆ మరుసటి బంతికే భారీ షాట్కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 77 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ కోల్పోయింది.
వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ సైతం ధాటిగా ఆడాడు. ఓ వైపు రుతురాజ్ ఆచి తూచి ఆడగా మరోవైపు కిషన్ వేగంగా పరుగులు సాధించాడు. రెండో వికెట్కు 87 పరుగులు జోడించిన తరువాత ఇషాన్ కిషన్ పెవిలియన్కు చేరగా సూర్యకుమార్ యాదవ్ (19 10 బంతుల్లో 2 సిక్సర్లు) వేగంగా ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు. ఆఖర్లో రింకూ సింగ్ ధాటిగా ఆడడంతో భారత స్కోరు 230 పరుగులు దాటింది.
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం