దుబాయ్ లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
- November 27, 2023
దుబాయ్: దుబాయ్ లోని అల్ ఘిసైస్ ప్రాంతంలో గల మాయామణి హాల్ లో కార్తీక పౌర్ణమి సందర్బంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సీతా కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడ్డ ఈ కార్యక్రమం ఉదయం గణపతి పూజ తో మొదలై మధ్యాహ్నం మంగళాశాసనం తో ముగిసింది.వేదోక్త ప్రకారంగా మొదలైన ఈ కార్యక్రమం విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మి అష్టకం, పురుష సూక్త సహిత అభిషేకం తో కొనసాగింది. ముందుగానే రిజిస్టర్ చేసుకున్న 45 జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి అనంత కృపా కటాక్షానికి పాత్రులైయ్యారు.కన్నుల పండుగగా జరిగిన పూజ లో పాల్గొన్న జంటలు తిరుపతి లడ్డు ప్రసాదం, అన్నవరం సత్యదేవుని బంగీ ప్రసాదం అందుకున్నారు.ముకుంద్ కౌశిక్.బి అయ్యంగార్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ ఈ కార్యక్రమం సీతా కమిటీ సభ్యులు అశోక్ కుమార్, రంగనాథ్, సి.వెంకటేశ్వరరావు, పీ.వేంకటేశ్వర రావు, సి.హెచ్.నాగరాజు, ఆర్. భరత్ ,ఊర కృష్ణ, వసుధా గుప్తా మరియు ప్రశాంత్ సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా ముగిసింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!