దుబాయ్ లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
- November 27, 2023
దుబాయ్: దుబాయ్ లోని అల్ ఘిసైస్ ప్రాంతంలో గల మాయామణి హాల్ లో కార్తీక పౌర్ణమి సందర్బంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సీతా కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడ్డ ఈ కార్యక్రమం ఉదయం గణపతి పూజ తో మొదలై మధ్యాహ్నం మంగళాశాసనం తో ముగిసింది.వేదోక్త ప్రకారంగా మొదలైన ఈ కార్యక్రమం విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మి అష్టకం, పురుష సూక్త సహిత అభిషేకం తో కొనసాగింది. ముందుగానే రిజిస్టర్ చేసుకున్న 45 జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి అనంత కృపా కటాక్షానికి పాత్రులైయ్యారు.కన్నుల పండుగగా జరిగిన పూజ లో పాల్గొన్న జంటలు తిరుపతి లడ్డు ప్రసాదం, అన్నవరం సత్యదేవుని బంగీ ప్రసాదం అందుకున్నారు.ముకుంద్ కౌశిక్.బి అయ్యంగార్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ ఈ కార్యక్రమం సీతా కమిటీ సభ్యులు అశోక్ కుమార్, రంగనాథ్, సి.వెంకటేశ్వరరావు, పీ.వేంకటేశ్వర రావు, సి.హెచ్.నాగరాజు, ఆర్. భరత్ ,ఊర కృష్ణ, వసుధా గుప్తా మరియు ప్రశాంత్ సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా ముగిసింది.
_1701027140.jpg)
_1701027022.jpg)
తాజా వార్తలు
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!









