దుబాయ్ లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
- November 27, 2023
దుబాయ్: దుబాయ్ లోని అల్ ఘిసైస్ ప్రాంతంలో గల మాయామణి హాల్ లో కార్తీక పౌర్ణమి సందర్బంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సీతా కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడ్డ ఈ కార్యక్రమం ఉదయం గణపతి పూజ తో మొదలై మధ్యాహ్నం మంగళాశాసనం తో ముగిసింది.వేదోక్త ప్రకారంగా మొదలైన ఈ కార్యక్రమం విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మి అష్టకం, పురుష సూక్త సహిత అభిషేకం తో కొనసాగింది. ముందుగానే రిజిస్టర్ చేసుకున్న 45 జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి అనంత కృపా కటాక్షానికి పాత్రులైయ్యారు.కన్నుల పండుగగా జరిగిన పూజ లో పాల్గొన్న జంటలు తిరుపతి లడ్డు ప్రసాదం, అన్నవరం సత్యదేవుని బంగీ ప్రసాదం అందుకున్నారు.ముకుంద్ కౌశిక్.బి అయ్యంగార్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ ఈ కార్యక్రమం సీతా కమిటీ సభ్యులు అశోక్ కుమార్, రంగనాథ్, సి.వెంకటేశ్వరరావు, పీ.వేంకటేశ్వర రావు, సి.హెచ్.నాగరాజు, ఆర్. భరత్ ,ఊర కృష్ణ, వసుధా గుప్తా మరియు ప్రశాంత్ సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా ముగిసింది.
_1701027140.jpg)
_1701027022.jpg)
తాజా వార్తలు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..







