భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించిన మలేషియా

- November 27, 2023 , by Maagulf
భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించిన మలేషియా

డిసెంబర్ 1 నుంచి భారత్ నుంచి వచ్చే సందర్శకులకు 30 రోజుల వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తామని మలేషియా ఆదివారం తెలిపింది. శ్రీలంక మరియు థాయ్‌లాండ్ తర్వాత భారతీయ పౌరులకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించిన మూడవ ఆసియా దేశంగా మలేషియా నిలిచింది. ప్రస్తుతం సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, టర్కీ మరియు జోర్డాన్ నుండి వచ్చే ప్రయాణికులు వీసా మినహాయింపును పొందుతున్నారు. అయితే వీసా మినహాయింపు సెక్యూరిటీ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని ఆదేశ ప్రధాని చెప్పారు. నేర చరిత్ర, హింసాత్మక ప్రమాదం ఉన్నవారికి వీసా లభించదని ఆయన తెలిపారు. 2022లో RM 86.22 బిలియన్ల (USD 19.63 బిలియన్లు) మొత్తం వాణిజ్యంతో భారతదేశం మలేషియా 11వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇది 2021లో నమోదైన విలువతో పోలిస్తే 23.6 శాతం పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com