హైదరాబాద్ లో ప్రధాని మోడీ రోడ్ షో..
- November 27, 2023
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్టీసీ క్రాస్ రోడ్ చేరుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వరకు మోడీ రోడ్ షో చేపడుతున్నారు. ఈ రోడ్ షోలో బిజెపి కార్యకర్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ కోటిదీపోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో వీలైనన్నీ సీట్లు గెలిచి సత్తా చాటాలని బిజెపి అధిష్ఠానం భావిస్తోంది.
కాగా, తెలంగాణలో పలు చోట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ లో, మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ విజయ సంకల్ప సభలో పాల్గొని బిఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









