తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- June 29, 2026
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ఎత్తున బదిలీల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 36 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ (DGP) సీవీ ఆనంద్ సోమవారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.శాంతి భద్రతల పరిరక్షణ, పరిపాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగానే ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
వెయిటింగ్లో ఉన్న అధికారులకు లైన్ క్లియర్..తక్షణమే అమలు!
ఈ తాజా బదిలీల ఉత్తర్వులలో సుదీర్ఘకాలంగా ఎలాంటి లూప్ లైన్ లేదా పోస్టింగ్స్ లేకుండా డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్న అధికారులకు ప్రాధాన్యత లభించింది. గత కొంతకాలంగా పోస్టింగ్స్ కోసం ఎదురుచూస్తున్న 28 మంది సివిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులకు ఈ ఉత్తర్వుల ద్వారా విధుల్లోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న వివిధ సబ్-డివిజన్లు, విభాగాలు, స్పెషల్ వింగ్ లలోని స్థానాల్లో వీరికి కొత్త పోస్టింగులను కేటాయించారు. ఈ బదిలీల ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని, బదిలీ అయిన అధికారులు తక్షణమే తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరికొంత మంది పోలీస్ అధికారుల బదిలీలు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.

తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







