సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్‌కు ICIE ఆహ్వానం

- June 29, 2026 , by Maagulf
సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్‌కు ICIE ఆహ్వానం
  • తైవాన్‌లోని ఐఐఐ, ఎన్‌వైసీయూ సంస్థలతో వ్యూహాత్మక చర్చలు నిర్వహించిన సందీప్ కుమార్ మక్తాల
  • జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు తైవాన్‌లో సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, స్టార్టప్‌లు, పరిశోధన, ఆవిష్కరణ రంగాలపై అంతర్జాతీయ ప్రతినిధి బృందం పర్యటన

తైపీ, తైవాన్: ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, సాంకేతికత, పారిశ్రామికత, విద్యా రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇన్నోవేటర్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్స్ (ICIE) ఆధ్వర్యంలో “ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ తైవాన్” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఐసీఐఈ వ్యవస్థాపక కన్వీనర్ సందీప్ కుమార్ మక్తాల తైవాన్ ప్రభుత్వానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ (III)లో అంతర్జాతీయ సహకార వ్యూహాల అధికారి వివియన్ హువాంగ్‌తో పాటు, నేషనల్ యాంగ్ మింగ్ చియావో టుంగ్ యూనివర్సిటీ (NYCU) ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్ సీఈఓ డాక్టర్ మైఖేల్ లిన్‌తో వ్యూహాత్మక చర్చలు నిర్వహించారు.

ఈ చర్చల్లో సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, స్టార్టప్‌లు, పరిశోధన, ప్రతిభ మార్పిడి, పరిశ్రమ–విద్యాసంస్థల భాగస్వామ్యాలు, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

ప్రపంచ సెమీకండక్టర్ తయారీ రంగానికి కేంద్రబిందువుగా గుర్తింపు పొందిన తైవాన్ ప్రస్తుతం కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ, అధునాతన తయారీ, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లలో ప్రపంచవ్యాప్తంగా కీలక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ తైవాన్ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు తైవాన్ ఆవిష్కరణ వ్యవస్థను ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం పొందనున్నారు.

ఈ సందర్భంగా సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా పాల్గొనేవారు తైవాన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, యాక్సిలరేటర్లు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్ వేదికలు, పరిశ్రమల ప్రముఖులతో ప్రత్యక్షంగా అనుసంధానమయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే అంతర్జాతీయ భాగస్వామ్యాలు, పెట్టుబడులు, మార్కెట్ విస్తరణ, సాంకేతిక సహకారం, పరిశోధన భాగస్వామ్యాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.

జూలై 29 నుంచి ఆగస్టు 2, 2026 వరకు నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ ప్రతినిధి బృందం పర్యటనలో సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, డీప్ టెక్నాలజీ, అధునాతన తయారీ, స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పరిశోధన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

వ్యాపారవేత్తలు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, ఎగుమతిదారులు, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, పరిశ్రమ సంఘాలు, విద్యాసంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమానికి నమోదులు ప్రారంభమయ్యాయి.

ఆసక్తి ఉన్న వారు http://bit.ly/explore2expand ద్వారా నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం +91 8019977575 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com