సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్‌లు

- November 28, 2023 , by Maagulf
సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్‌లు

జెడ్డా: సౌదీ టూరిజం అథారిటీ (STA) షాంఘై బండ్ వాటర్‌ఫ్రంట్‌లో 'ఎంబార్క్ ఆన్ ఎ జర్నీ ఆఫ్ డిస్కవరీ టు సౌదీ' పేరుతో చైనాలో అత్యంత విస్తృతమైన ఇంటిగ్రేటెడ్ ట్రావెల్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 400 మంది వాణిజ్య భాగస్వాములు పాల్గొన్నారు. నవంబర్ 17 నుండి 23 వరకు షాంఘై బండ్ వాటర్ ఫ్రంట్‌లో సౌదీ సంస్కృతి, వారసత్వం మరియు ప్రకృతి సౌందర్యాన్ని సౌదీ పర్యాటక బృందం ప్రదర్శించింది. 80 వేల మంది సందర్శించారు.   నవంబర్ 17న ప్రారంభించబడిన డెస్టినేషన్ అనుభవ వీడియోలు, ఒంటెల యాత్రికులు, స్టార్‌గేజింగ్, దిరియా మరియు అల్ మస్మాక్ కోట వంటి చారిత్రాత్మక ప్రదేశాలు, అల్ ఉలా మరియు ఎర్ర సముద్రంలో సాహసాలు వంటి సాంప్రదాయ బెడౌయిన్ టెంట్ వంటి టూరిజం ప్రాంతాలపై ప్రదర్శనలు చైనీయులను ఆకట్టుకున్నాయని సౌదీ టూరిజం అథారిటీ సీఈఓ ఫహద్ హమిదాద్దీన్ తెలిపారు.  2023లో ఇప్పటికే 100,000 మంది చైనీస్ సందర్శకులను స్వాగతించడంతోపాటు  సౌదీ అరేబియా 2030 నాటికి ఏటా ఐదు మిలియన్ల మంది ప్రయాణికులను స్వాగతించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సౌదీకి బుకింగ్‌లలో 277% పెరుగుదలను నమోదు చేయడంతో తమ ప్రచారం విజయవంతం అయిందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com