ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్తో 'NATS' ఇష్టాగోష్టి
- November 29, 2023
అమెరికా: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్తో ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించింది. నాట్స్ తెలుగు లలితా కళా వేదిక ప్రతి నెల తెలుగు కళా రంగాలకు చెందిన ప్రముఖులతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా మాధవపెద్ది సురేశ్తో ఆన్లైన్ వేదికగా నిర్వహించిన “మధురమే సుధాగానం" కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. తన సంగీత ప్రయాణం ఎలా ప్రారంభమైంది.? ఆనాటి సంగీత దర్శకులు, వారితో తనకున్న అనుభవాలను మాధవపెద్ది సురేశ్ వివరించారు.
భైరవద్వీపం సినిమాలో తన పాటల విజయం వెనుక ఉన్న అనేక ఆసక్తికర విషయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. తెలుగు సినీ సంగీతంలో శాస్త్రీయ సంగీతం పోషించిన పాత్రను కూడా మాధవపెద్ది వివరించారు. ఏ పాటైనా వినటానికి వినసొంపుగా ఉండటంతో చక్కటి సాహిత్యం ఉంటే ఆ పాట పది కాలాల పాటు నిలిచిపోతుందని తెలిపారు. ఆద్యంతం ఎంతో ఆసక్తిగా, ఆహ్లాదకరంగా సాగిన ఈ కార్యక్రమానికి శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ, గిరి కంభంమెట్టు, మురళీకృష్ణ మేడిచెర్ల వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. నాట్స్ తెలుగు కళలు, సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న కృషిని, నాట్స్ హెల్ప్ లైన్ 1-888-4-తెలుగు ద్వారా చేస్తున్న సేవలను నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి వివరించారు. అంతేకాక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి కృషిచేసిన లలిత కళా వేదిక కోర్ సభ్యులు కిశోర్ భరద్వాజ్ (కిభశ్రీ), సాయి ఎఱ్ఱాప్రగడ, మురళి మేడిచెర్ల, గిరి కంభంమెట్టుతో పాటు ఇతర సభ్యుల చొరవను కొనియాడారు. నాట్స్ ఆహ్వానించగానే వచ్చి, అలనాటి సంగీత మాధుర్యం గొప్పతనాన్ని వివరించిన మాధవపెద్ది సురేశ్కు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









