సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్.! ఎవరు గెలుస్తారో తేలిపోతుంది.!
- November 30, 2023
ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత వెల్లడయ్యే అవకాశం వుంది. ఇప్పటికే చాలా సర్వేలు శాంపిల్స్ తీసేసుకోగా, పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ ఓటర్ల మొబైల్ పోన్లకు కాల్స్ వెళుతున్నాయి.
‘మీరు ఎవరికి ఓటు వేశారు.?’ అంటూ ఐవీఆర్ కాల్స్ వస్తుండడంతో ఓటర్లకు ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు. పోలింగ్ బూతులకు సమీపంలో కూడా ఓటర్లను ఈ ‘శాంపిల్స్’ కోసం ఇబ్బంది పెడుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తోన్న సంస్థలు.
సాయంత్రం మీడియా సమావేశం.. అంటూ ఆయా సంస్థలు, మీడియాకి కూడా సమాచారం పంపేశాయి ఎగ్జిట్ పోల్ ఫలితాల వెల్లడికి సంబంధించి. ఇటీవలి కాలంలో ఇదో కొత్త ఒరవడి అనుకోవాలేమో.!
కాగా, సర్వేల పేరుతోనూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్న తీరు చూసి, ఓటర్లు ఆశ్చర్యపోతున్నారు, ఆవేదన చెందుతున్నారు.
ఇదిలా వుంటే, మేమే గెలుస్తాం.. అంటూ ఆయా పార్టీలు ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఫేక్ సర్వేలను తమ అనుకూల మీడియా సంస్థల ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళి, ఓటర్లను అయోమయంలో పడేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







