ఓట్ల పండగ.! తెలంగాణలో ఓట్లేసిన సినీ ప్రముఖులు.!
- November 30, 2023
తెలుగు సినీ ప్రముఖుల్లో చాలామందికి ఓటు హక్కు తెలంగాణలోనే వుంది. అదీ, హైద్రాబాద్లో.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో సినీ ప్రముఖులు సందడి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, యంగ్ టైగర్ ఎన్టీయార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించారు. కుటుంబ సమేతంగా సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేయడంతో, వారిని చూసేందుకు జనం ఎగబడ్డారు. మీడియా హడావిడి మామూలే.
‘మీరు ఇక్కడే కవరేజ్లో వుండిపోతే, ఓట్లెలా వెయ్యడం.?’ అని జూనియర్ ఎన్టీయార్, మీడియాని ఉద్దేశించి ప్రశ్నించారు. ‘సగం మంది ఓటెయ్యలేరు..’ అని కొందరు మీడియా ప్రతినిథులు చెప్పడం గమనార్హం.
కాగా, ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలు కాగా, పోలింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో బారుల తీరారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంటే, తెలంగాణలో తొలిసారి అధికార పీఠమెక్కుతామని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ కూడా, తొలిసారి తమకు అవకాశం దక్కుతుందని అంటోంది.
తెలంగాణలో బోణీ కొట్టాలనుకుంటోంది జనసేన పార్టీ.! ఆయా పార్టీల అంచనాలెలా వున్నా, ఓటరు మదిలో ఏముందన్నది డిసెంబర్ 3న తేలుతుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







