ఓట్ల పండగ.! తెలంగాణలో ఓట్లేసిన సినీ ప్రముఖులు.!
- November 30, 2023
తెలుగు సినీ ప్రముఖుల్లో చాలామందికి ఓటు హక్కు తెలంగాణలోనే వుంది. అదీ, హైద్రాబాద్లో.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో సినీ ప్రముఖులు సందడి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, యంగ్ టైగర్ ఎన్టీయార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించారు. కుటుంబ సమేతంగా సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేయడంతో, వారిని చూసేందుకు జనం ఎగబడ్డారు. మీడియా హడావిడి మామూలే.
‘మీరు ఇక్కడే కవరేజ్లో వుండిపోతే, ఓట్లెలా వెయ్యడం.?’ అని జూనియర్ ఎన్టీయార్, మీడియాని ఉద్దేశించి ప్రశ్నించారు. ‘సగం మంది ఓటెయ్యలేరు..’ అని కొందరు మీడియా ప్రతినిథులు చెప్పడం గమనార్హం.
కాగా, ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలు కాగా, పోలింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో బారుల తీరారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంటే, తెలంగాణలో తొలిసారి అధికార పీఠమెక్కుతామని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ కూడా, తొలిసారి తమకు అవకాశం దక్కుతుందని అంటోంది.
తెలంగాణలో బోణీ కొట్టాలనుకుంటోంది జనసేన పార్టీ.! ఆయా పార్టీల అంచనాలెలా వున్నా, ఓటరు మదిలో ఏముందన్నది డిసెంబర్ 3న తేలుతుంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







