ఓట్ల పండగ.! తెలంగాణలో ఓట్లేసిన సినీ ప్రముఖులు.!
- November 30, 2023
తెలుగు సినీ ప్రముఖుల్లో చాలామందికి ఓటు హక్కు తెలంగాణలోనే వుంది. అదీ, హైద్రాబాద్లో.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో సినీ ప్రముఖులు సందడి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, యంగ్ టైగర్ ఎన్టీయార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించారు. కుటుంబ సమేతంగా సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేయడంతో, వారిని చూసేందుకు జనం ఎగబడ్డారు. మీడియా హడావిడి మామూలే.
‘మీరు ఇక్కడే కవరేజ్లో వుండిపోతే, ఓట్లెలా వెయ్యడం.?’ అని జూనియర్ ఎన్టీయార్, మీడియాని ఉద్దేశించి ప్రశ్నించారు. ‘సగం మంది ఓటెయ్యలేరు..’ అని కొందరు మీడియా ప్రతినిథులు చెప్పడం గమనార్హం.
కాగా, ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలు కాగా, పోలింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో బారుల తీరారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంటే, తెలంగాణలో తొలిసారి అధికార పీఠమెక్కుతామని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ కూడా, తొలిసారి తమకు అవకాశం దక్కుతుందని అంటోంది.
తెలంగాణలో బోణీ కొట్టాలనుకుంటోంది జనసేన పార్టీ.! ఆయా పార్టీల అంచనాలెలా వున్నా, ఓటరు మదిలో ఏముందన్నది డిసెంబర్ 3న తేలుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









