ఫిలిఫ్పీన్స్లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- December 02, 2023
ఆసియా దేశం ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మిండనావోలో శనివరాం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC) తెలిపింది.భూమికి 63 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు చెప్పింది.
భారీ భూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికల్ని జారీ చేసింది. గత నెల ప్రారంభంలో కూడా దక్షిణ ఫిలిప్పీన్స్లో 6.7 భూకంపం సంభవించింది. దీంతో 8 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి.
పసిఫిక్ మహా సముద్రంలో 'పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్' అనే ప్రదేశంలో ఇండోనేషియా, ఫిలిఫ్పీన్స్, జపాన్ వంటి దేశాలు ఉన్నాయి. దీంతో అక్కడ తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు నిరంతరం చోటు చేసుకుంటాయి. దీంతో పాటు క్రియాశీలక అగ్నిపర్వతాలకు ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది. దీంతోనే ఇక్కడ తరుచుగా భూకంపాలు వస్తుంటాయి.
తాజా వార్తలు
- HCA అధ్యక్షుడు జగన్మోహన్రావు అరెస్ట్
- ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- దేశ వారసత్వ సంపద వెలకట్టలేని ఆస్తి: సీపీ సీవీ ఆనంద్
- జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్..
- Emirates signs MoU with Crypto.com for future integration of Crypto.com Pay as a payment option for customers
- యాపిల్ సీవోవోగా భారత సంతతి చెందిన సబిహ్ కాన్
- అమెరికాలో క్రికెట్ కప్ గెలిచిన టాలీవుడ్ స్టార్స్..
- గగన్యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందగుడు
- దుబాయ్లో ఘనంగా జరిగిన వైఎస్సార్ జయంతి
- దుబాయ్ లో డెలివరీ బైక్ రైడర్లకు ఆర్టీఏ గుడ్ న్యూస్..!!