బెంగళూరులో భారత్ విజయం.. 4-1తో సిరీస్ కైవసం
- December 04, 2023
బెంగళూరు: నామమాత్రమైన ఆఖరి టీ20 మ్యాచులోనూ భారత్ విజయం సాధించింది. తద్వారా 4-1 తేడాతో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచులో భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లలో బెన్ మెక్డెర్మాట్ (54; 36 బంతుల్లో 5 సిక్సర్లు) అర్ధశతకం బాదాడు.
ట్రావిస్ హెడ్ (28), మాథ్యూవేడ్ (22), టిమ్ డేవిడ్ (17)లు ఓ మోస్తరుగా రాణించారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్ చెరో రెండు తీయగా అక్షర్ పటేల్లు ఓ వికెట్ సాధించాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ ( 53; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. అక్షర్ పటేల్ (31; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), జితేశ్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (21) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డార్వాయిస్, జాసన్ బెహ్రెన్డార్ఫ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. తన్వీర్ సంఘ, ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







