బెంగళూరులో భారత్ విజయం.. 4-1తో సిరీస్ కైవసం
- December 04, 2023
బెంగళూరు: నామమాత్రమైన ఆఖరి టీ20 మ్యాచులోనూ భారత్ విజయం సాధించింది. తద్వారా 4-1 తేడాతో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచులో భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లలో బెన్ మెక్డెర్మాట్ (54; 36 బంతుల్లో 5 సిక్సర్లు) అర్ధశతకం బాదాడు.
ట్రావిస్ హెడ్ (28), మాథ్యూవేడ్ (22), టిమ్ డేవిడ్ (17)లు ఓ మోస్తరుగా రాణించారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్ చెరో రెండు తీయగా అక్షర్ పటేల్లు ఓ వికెట్ సాధించాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ ( 53; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. అక్షర్ పటేల్ (31; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), జితేశ్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (21) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డార్వాయిస్, జాసన్ బెహ్రెన్డార్ఫ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. తన్వీర్ సంఘ, ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







