యూఏఈలో 17 మంది బిలియనీర్లు
- December 04, 2023
యూఏఈ: UBS బిలియనీర్ ఆంబిషన్స్ రిపోర్ట్ 2023 ప్రకారం.. 2023లో 5 మంది బిలియనీర్లు ఎమిరేట్స్కు తమ నివాసాన్ని మార్చారు. UHNWIల సంపద గత రెండు సంవత్సరాలలో అపారంగా పెరిగింది. కీలకమైన వ్యూహాత్మక రంగాలలో(రియల్ ఎస్టేట్, ట్రావెల్ అండ్ టూరిజం, రిటైల్) బలమైన వృద్ధి కారణంగా బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. బిలియనీర్ల మొత్తం సంపద 2023లో 157 శాతం పెరిగి 99.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది అంతకు ముందు ఏడాది 38.7 బిలియన్ డాలర్లుగా ఉంది. మహమ్మారి తర్వాత దాని ఆర్థిక వ్యవస్థ 2022లో బాగా పెరిగింది, GDP 7.6 శాతం పెరిగింది. గత 10 ఏళ్లలో దాదాపు 1,500 మంది మిలియనీర్లు యూకే నుండి దుబాయ్కి మకాం మార్చారని న్యూ వరల్డ్ వెల్త్ వెల్లడించింది. ఈ ఏడాది మరో 250 మంది మకాం మార్చనున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023 అంచనా ప్రకారం ఈ ఏడాది 4,500 మంది మిలియనీర్లు యూఏఈకి మకాం మార్చనున్నారు. UBS బిలియనీర్ ఆంబిషన్స్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ (26) తర్వాత మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా (MEA) ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లకు యూఏఈ నిలయంగా ఉంది. ఆ తర్వాత సౌదీ అరేబియా (6), దక్షిణాఫ్రికా (5), ఈజిప్ట్ (4), నైజీరియా (3), లెబనాన్ (2) ఉన్నాయి. MEA ప్రాంతంలో సుమారు 63 మంది బిలియనీర్లు ఉన్నారు. ఏప్రిల్ 6, 2023 వరకు 12 నెలల అధ్యయన వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 7 శాతం పెరిగి, 2,376 నుండి 2,544 వరకు పెరిగిందని అధ్యయనం వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!









