‘గుడ్లవల్లేరు’లో వైభవంగా త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు
- December 04, 2023
అమరావతి: డిసెంబర్ 30న గుడ్లవల్లేరు గ్రామంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన, స్వర్గీయ డాక్టర్ గుడ్లవల్లేటి లక్ష్మణరావు జయంతి ఉత్సవాలను నిర్వహించారు. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణములోని త్యాగరాజస్వామి వారి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడ్లవల్లేటి కామేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్యవక్తలుగా డాక్టర్ ఉప్పలపాటి వేణుగోపాలరావు (స్థానిక వైద్యులు), బిహెచ్విఎల్ రాధాకృష్ణ మూర్తి (రిటైర్డ్ ఎల్ఐసి ఉద్యోగి, అధ్యక్షులు త్యాగరాజ సంగీత విద్యా పీఠం, మచిలీపట్నం), గుడ్లవల్లేటి మృత్యంజయరావు (రిటైర్డ్ ప్రిన్సిపాల్, మచిలీపట్నం హిందూ కాలేజీ), వల్లభనేని వెంకటేశ్వర రావు (కమిటీ సభ్యులు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, గుడ్లవల్లేరు) హాజరై ప్రసంగించారు. అనంతరం నిర్వహించిన సంగీత కార్యక్రమంలో సింగరాజు కళ్యాణి (AIR ఆర్టిస్ట్, కార్యదర్శి త్యాగరాజ సంగీత విద్యా పీఠం, మచిలీపట్నం) గారికి, పాలపర్తి ఆంజనేయ శాస్త్రి, (వయోలిన్, AIR & TV ఆర్టిస్ట్, అవనిగడ్డ), కాపవరపు సుబ్బారావు (మృదంగం, AIR & TV ఆర్టిస్ట్, భీమవరం) సహకరించి శ్రోతలను అలరించారు. చివరగా గుడ్లవల్లేటి వెంకట సుబ్బరామన్ వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని గుడ్లవల్లేటి లక్ష్మణ రావు కుటుంబ సభ్యులు వెల్లడించారు.



తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







