భారతదేశం, జపాన్ రాయబారులను స్వీకరించిన రాయల్ ఆఫీస్ మినిస్టర్

- December 06, 2023 , by Maagulf
భారతదేశం, జపాన్ రాయబారులను స్వీకరించిన రాయల్ ఆఫీస్ మినిస్టర్

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి అమిత్ నారంగ్‌ను రాయల్ ఆఫీస్ మంత్రి జనరల్ సుల్తాన్ మహ్మద్ అల్ నుమానీ మంగళవారం ఇక్కడ కలుసుకున్నారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించేందుకు సహకారాన్ని పెంపొందించడంలో ఒమన్ సుల్తానేట్‌కు రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో ఇరు పక్షాలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై సమీక్షించుకున్నాయి. ఇదిలా ఉండగా, ఒమన్ సుల్తానేట్‌లో జపాన్ రాయబారి జోటా యమమోటోను కూడా రాయల్ ఆఫీస్ మంత్రి జనరల్ సుల్తాన్ మొహమ్మద్ అల్ నుమాని  కలుసుకున్నారు. అనేక ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలకు సంబంధించి సుల్తానేట్ ఆఫ్ ఒమన్ వైఖరిపై ఆయన ప్రశంసలు కురిపించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com