అంతర్జాతీయ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
- December 06, 2023
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు 5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డి విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల అధినేత చైతన్యరాజులు తెలిపారు.గవర్నర్ ని అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, మహాసభల ముఖ్య సమన్వయ కర్త కేశిరాజు రామప్రసాద్, సలహదారు తాతా సాయిబాబా కలసి దిల్ ఖుష్ అతిధి గృహం, హైదరాబాద్ లో ప్రత్యేకంగా కలసి ఆహ్వానించినట్లు తెలిపారు.
5 జనవరి 2024 సాయంత్రం 5 గంటలకు జరిగే "పూర్ణకుంభ పురస్కారాల ప్రధానోత్సవ సభకు వారు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రాచీన రాజ, కవుల వంశీకులను, కీర్తి శేషులైన తెలుగు వెలుగుల కుటుంబాల వారిని, నేటి ప్రఖ్యాత సాహితీ,చలనచిత్ర ,లలిత కళల కు సేవలందించిన లబ్ద ప్రతిష్టులకు, పత్రికలకు, అంతర్జాతీయ, జాతీయ సాంస్కృతిక తెలుగు సంఘాలకు "పూర్ణకుంభ కుంభ పురస్కారాలు" ప్రదానం చేసి, వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వనున్నారని డా.గజల్ శ్రీనివాస్.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







