చెన్నై వరదల్లో చిక్కుకున్న వారికి హెలికాప్టర్ల వాయుసేన ఆహారం అందజేత
- December 06, 2023
చెన్నై: మిగ్జాం తుఫాన్ తాకిడికి చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి వరదనీరు రావటంతో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అక్కడ వరుణుడు శాంతించాడు. అయినప్పటికీ నగరంలోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇంకా తొలగిపోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా కరెంటు, ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న వారికి హెలికాప్టర్ల ద్వారా భారత వాయు సేన ఆహార ప్యాకెట్లను అందజేస్తోంది. కొందరు సినీ నటులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం నగరంలో వరదల్లో చిక్కుకున్న వారికి తమ వంతు సాయం అందిస్తున్నారు.
కాగా, తుఫాన్ ప్రభావంతో తమిళనాడు భారీగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇవాళ కేంద్రానికి లేఖ రాశారు. తక్షణ సాయం కింద రూ.5,060 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోడీChennaiని కోరుతూ సీఎం స్టాలిన్ లేఖ రాశారు. మిగ్జాం వల్ల నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర సర్కారు బృందాన్ని పంపాలని ఆయన కోరారు. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు.
తాజా వార్తలు
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!







