ఎల్బీ స్టేడియం పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు: డీజీపీ
- December 06, 2023
హైదరాబాద్: తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం నేపథ్యంలో రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. దాదాపు లక్ష మంది సభకు హాజరు కావొచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో 30 వేల మందికి కూర్చొనే సౌకర్యం ఉందన్నారు. మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని డీజీపీ తెలిపారు.
తాజా వార్తలు
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!









