అక్రమ వెబ్సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం
- December 06, 2023
న్యూ ఢిల్లీ: అక్రమ పెట్టుబడులు, ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 100కు పైగా వెబ్సైట్లపై కేంద్ర ఐటీ శాఖ నిషేధం విధించింది. పార్ట్టైమ్ జాబ్ల పేరుతో జరుగుతున్న ఆన్లైన్ నేరాలపై కేంద్ర హోం శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ విచారణ చేపట్టింది.
చాలా వెబ్సైట్లు వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్టైమ్ జాబ్లు అంటూ మోసాలకు పాల్పడుతున్నాయి. వీటిని గుర్తించిన కేంద్ర ఐటీ శాఖ ప్రత్యేక అధికారాలు కలిగిన 100కు పైగా వెబ్ సైట్లపై నిషేధం విధించింది. డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్లు, అద్దె ఖాతాలను ఉపయోగించి ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆర్థిక నేరాలను ప్రోత్సహిస్తున్న విదేశీ వ్యక్తులు ఈ వెబ్సైట్లను నిర్వహిస్తున్నారని ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
క్రిప్టో కరెన్సీ, విదేశీ ఏటీఎం కార్డులు, అంతర్జాతీయ ఫిన్టెక్ కంపెనీల సాయంతో ఆర్థిక మోసాల సొమ్మును కాజేస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు అంటూ ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులే ఎక్కువగా వారు టార్గెట్ చేస్తున్నారని అన్నారు. అటువంటి ప్రకటనలను క్లిక్ చేసిన తర్వాత వారి ఏజెంట్లు WhatsApp, టెలిగ్రామ్ వంటి మాధ్యమాలలో వినియోగదారులతో మాట్లాడుతున్నారు.
వీడియోలను లైక్ చేయడం, సబ్స్క్రయిబ్ చేయడం, రేటింగ్ ఇవ్వడం ద్వారా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చని వినియోగదారులను మోసం చేస్తున్నారు. ముందుగా కొంత కమీషన్ ఇచ్చి తర్వాత లాభం వస్తుందని మోసం చేస్తారు. ఇలాంటి మోసాలు చాలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయవద్దని సూచించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







