ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జనం ముందుకు వచ్చిన కేసీఆర్..
- December 06, 2023
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండుసార్లు బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టిన ఓటర్లు ఈసారి మాత్రం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. హస్తం పార్టీకి జై కొట్టారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు అయ్యింది. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి జనం ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. కేసీఆర్ ను చూడగానే ఒక్కసారిగా.. సీఎం కేసీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. కేసీఆర్ వారందరికీ అభివాదం చేశారు. కేసీఆర్ పక్కనే మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఉన్నారు.
ఎర్రవెల్లి గ్రామంలో తన నివాసంలో ఉన్న కేసీఆర్ ను చూసేందుకు చింతమడక (కేసీఆర్ స్వగ్రామం) నుంచి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. వారి ముందుకు కేసీఆర్ రాగానే.. వారంతా కొంత ఎమోషన్ అయ్యారు. సీఎం సీఎం.. సీఎం కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









