ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జనం ముందుకు వచ్చిన కేసీఆర్..
- December 06, 2023
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండుసార్లు బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టిన ఓటర్లు ఈసారి మాత్రం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. హస్తం పార్టీకి జై కొట్టారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు అయ్యింది. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి జనం ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. కేసీఆర్ ను చూడగానే ఒక్కసారిగా.. సీఎం కేసీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. కేసీఆర్ వారందరికీ అభివాదం చేశారు. కేసీఆర్ పక్కనే మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఉన్నారు.
ఎర్రవెల్లి గ్రామంలో తన నివాసంలో ఉన్న కేసీఆర్ ను చూసేందుకు చింతమడక (కేసీఆర్ స్వగ్రామం) నుంచి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. వారి ముందుకు కేసీఆర్ రాగానే.. వారంతా కొంత ఎమోషన్ అయ్యారు. సీఎం సీఎం.. సీఎం కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







