షిర్డీ సాయిబాబా మందిరంలో షారుక్ ఖాన్ పూజలు
- December 14, 2023
షిర్డీ: ‘డంకీ’ సినిమా విడుదల నేపథ్యంలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఇవాళ మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా మందిరాన్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో షారుక్తో పాటు ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా ఉంది.
సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితమే షారుక్ ఖాన్ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించిన విషయం తెలిసిందే. జవాన్ సినిమా విడుదలకు ముందు కూడా ఆయన ఇలాగే వైష్ణోదేవి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు.
డ్రామా, రొమాన్స్ జానర్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.
హిరానీ, గౌరీ ఖాన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా డంకీ సినిమా విడుదల కానుంది. దాదాపు 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో డంకీ సినిమా రూపుదిద్దుకుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష