తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత..
- December 17, 2023
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లోనే కాకుండా పగటి పూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. విపరీతమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి.
తెలంగాణలో చాలా చోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది.
ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాయలసీమ ప్రాంతంలో ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పలు చోట్ల ఉరుములతో కూడిన వానలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. విశాఖలోని ఏజెన్సీ గ్రామాలను చలి వణికిస్తోంది. చలి భయంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. అటు ఉత్తర భారతాన్ని చలి భయపెడుతోంది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









