మెడికల్ ఎస్కార్ట్తో సురక్షితంగా హైదరాబాద్కు నగేష్ పడిగెల
- December 20, 2023
బహ్రెయిన్: ప్రవాస భారతీయుల హృదయాన్ని కదిలించే ఓ సంఘటన బహ్రెయిన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బహ్రెయిన్లో నివసించే నగేష్ పడిగెల(36) సవాళ్లతో కూడిన ఆరోగ్య ప్రయాణాన్ని విజయవంతంగా అధిగమించారు. ఎంఫిసెమాటస్ కోలిసైస్టిటిస్ నిర్ధారణతో అక్టోబర్ 13న సల్మానియా ఆసుపత్రిలో చేరిన అతను తీవ్రమైన నొప్పి, వాంతులు మరియు బరువు తగ్గడాన్ని ఎదుర్కొన్నారు. సల్మానియా హాస్పిటల్ డాక్టర్ యూసుఫ్ మరియు అతని బృందం కృషి కారణంగా నగేష్ కోలుకున్నారు. తన చికిత్సను కొనసాగించడానికి, అతను గల్ఫ్ ఎయిర్వేస్ ద్వారా మెడికల్ ఎస్కార్ట్తో సురక్షితంగా హైదరాబాద్కు వెళ్ళారు. ఇందుకు చొరవ తీసుకున్నందుకు ప్రవాసీ లీగల్ సెల్ బహ్రెయిన్ చాప్టర్ అధ్యక్షుడు సుధీర్ తిరునిలత్కి నగేష్ పడిగెల మరియు అతని కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇమ్మిగ్రేషన్ అధికారులు వినోద్ కే జాకబ్ (బహ్రెయిన్లో భారత రాయబారి), రవి సింగ్, సురేన్ లాల్తో సహా ఎంబసీ అధికారులు, అలాగే ప్రవాసీ లీగల్ సెల్ (PLC) టీమ్, తెలుగు కళా సమితికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







