భారత్ లో కొత్తగా 341 కరోనా కేసులు
- December 20, 2023
న్యూఢిల్లీ: భారత దేశంలో మరోసారి కరోనా కలకలం రేగుతోంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 341 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో కేరళలో అత్యధికంగా 292 మందికి వైరస్ సోకింది. ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్న కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 భారత్ లోకి ఎంటరైంది. ఈ నెల 8న కేరళలో తొలి కేసు నమోదు కాగా.. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా బారిన పడి కేరళలో ముగ్గురు చనిపోయారని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో నలుగురికి వైరస్ సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య తొమ్మిదికి చేరిందని తెలిపింది. తమిళనాడులో 13 మంది, మహారాష్ట్రలో 11 మంది, కర్ణాటకలో 9 మంది, పుదుచ్చేరిలో నలుగురు కరోనా బారిన పడ్డారు. దేశంలోని మిగతా రాష్ట్రాలలో పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, కరోనా కొత్త సబ్ వేరియంట్ గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అలర్ట్ చేసింది. మరికాసేపట్లో హైలెవల్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







