రామమందిర ప్రారంభోత్సవం..108 అడుగుల అగరబత్తీ తయారీ!
- December 21, 2023
అయోధ్య: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం 108 అడుగుల పొడవున్న అగరబత్తీ సిద్ధం చేస్తున్నారు. గుజరాత్లోని వడోదరలో ఈ అగరబత్తీని తయారు చేస్తున్నారు.
ఇక జనవరి 22న నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయోధ్యలో పెద్ద ఎత్తున మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. నగరంలోని అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఫేజ్-1 ప్రాజెక్టు ఈ నెలాఖరుకల్లా పూర్తి కానుంది. ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన సప్లిమెంటరీ బడ్జెట్లో అయోధ్య అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అయోధ్య కన్సర్వేషన్, డెవలప్మెంట్ ఫండ్కు రూ.50 కోట్లు, రామోత్సవ్ 2023-24 కోసం రూ.100 కోట్లు, ఇంటర్నేషనల్ రామాయణ్, వైదిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ విస్తరణకు రూ.25 కోట్లు కేటాయించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







